ఆరుట్ల కమలాదేవి
అందరిలాగే సామాన్య కుటుంబంలో జన్మించింది... నాటి సామాజికస్థితికి అనుగుణంగా బాల్యవివాహం జరిగింది... భర్త ప్రోత్సాహంతో చదువుకుంది. ఒక్కో మెట్టు ఎదిగింది... రాజకీయ అవగాహనతో చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొంది... సాయుధ పోరాటంలో పాల్గొని తుపాకీ పట్టింది... శాసనసభ్యురాలై ప్రజాసమస్యల్ని పరిష్కరించింది... తెలంగాణ జనం గుండెల్లో చిరస్మరణీయురాలైంది... ఆమె ఎవరో ఇంతవరకూ చెప్పలేదుకదూ! ఇన్ని విశిష్టతలున్న తెలంగాణ మహిళాతేజం ఆరుట్ల కమలాదేవి!
ప్రజలే తన దేవుళ్ళన్న పవిత్ర ఆత్మకు జేజేలు! సమానత్వమే సార్థకతయని
నమ్మిన సాధ్వికి జేజేలు!!
కొందరు పుట్టి భూమికి భారమవుతారు. ఎక్కువమంది కుటుంబం కోసం శ్రమిస్తారు. కొద్దిమంది మాత్రమే అందరికోసం తమ జీవితాలను అంకితం చేస్తారు. అట్లాంటి కొద్దిమందిలో ఆరుట్ల కమలాదేవి ఎర్రగులాబీలా వికసించి తాను పుట్టిన నేల తల్లి పాదాలపై రాలిపోయింది.
తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు. ఉన్నత ఆశయాలు కల్గిన కమ్యూనిస్టు. ఆంధ్రరాష్ట్ర మహిళా ఉద్యమ నిర్మాణంలో నిరంతర కృషి చేసిన ధీరవనిత. నిజాం పాలనను అంతమొందించుటకు జరిగిన పోరాటంలో నిస్స్వార్థంగా, అంకితభావంతో పోరాటం చేసిన వీరవనిత ఆరుట్ల కమలాదేవి.
బాల్యం - వివాహం :
ఆరుట్ల కమలాదేవి యాదాద్రి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో పుట్టింది. పుట్టినపుడు తల్లిదండ్రులు ఆమెకు రుక్మిణి అని పేరుపెట్టారు. మధ్యతరగతి రైతుకుటుంబం వారిది. అది నిజాం పాలనలో పౌరహక్కులకు స్వేచ్ఛ లేని కాలం. సనాతన ఆచారాలు, మూఢవిశ్వాసాలు, కులమతతత్త్వం, అంటరానితనం వ్యవస్థని శాసిస్తున్న రోజులవి, పల్లెటూర్లలో పాఠశాలలు ఉండేవి కావు. ఆరోజులలో ఆడపిల్లలకి చదువులు ఊహించడం కూడా తప్పే. అందువల్ల రుక్మిణి బాల్యం ఇంటికే పరిమితమయ్యింది.
ఆడపిల్లలకు బాల్యంలోనే వివాహాలు చేయడం ఆచారంగా ఉండేది. రుక్మిణికి 11 సంవత్సరాల వయసు రాగానే తల్లిదండ్రులు పెళ్ళిచేయాలని నిశ్చయించారు. రుక్మిణి పుట్టినపుడే మేనమామ కొడుకు ఆరుట్ల రామచంద్రారెడ్డి భార్య అవుతుందని రెండు కుటుంబాలు నిశ్చయించుకున్నవి.
అప్పటికే ఆరుట్ల రామచంద్రారెడ్డి హైదరాబాదులో విద్యార్థిగా, రెడ్డి వసతిగృహంలో ఉంటూ ఆంధ్రమహాసభ సభ్యుడిగా, కాంగ్రెస్ కార్యకర్తగా, వందేమాతరం ఉద్యమకారుడిగా గుర్తింపు పొందాడు. తల్లిదండ్రులు పెళ్ళి ప్రస్తావన తేగానే బాలికగా ఉన్న రుక్మిణికి అప్పుడే పెళ్ళెందుకన్నడు. కొన్ని షరతులతో పెళ్ళికి అంగీకరించాడు. "పెళ్ళి సాంప్రదాయ పద్దతుల్లో కాకుండా ఆర్యసమాజం పద్ధతిలో జరగాలి. కట్నకానుకల పద్ధతి ఉండకూడదు. పెళ్ళయిన తరువాత రుక్మిణి తన సహచరిగా రాజకీయాలలో పాల్గొనాలి." అన్నాడు రామచంద్రారెడ్డి. ఇరు కుటుంబాలవారు షరతులు ఒప్పుకున్నారు. వివాహం జరిగింది. వివాహవేదికపై రుక్మిణి పేరును కమలాదేవిగా మార్చారు. కమలాదేవిని తీసుకొని రామచంద్రారెడ్డి హైదరాబాద్ చేరాడు.
రామచంద్రారెడ్డి కమలాదేవిని చదివించాలని ఈ వార్త విని ఎంతగానో సంతోషించింది. మాడపాటి హన్మంతరావు నెలకొల్పిన బాలికల పాఠశాలలో చేరింది. ఎక్కడ ఉండాలన్నది సమస్య. దంపతులిద్దరూ రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డిగారిని కలిసి బాలికలకు హాస్టల్ ఏర్పాటుచేయాలని కోరారు. దానికి వారు సరేనని బాలికల హాస్టల్ ఏర్పాటు చేశారు. ఆ బాలికల హాస్టల్లో కమలాదేవి ప్రథమ విద్యార్ధిగా ప్రవేశించింది. పట్టుదలతో చదివి మెట్రిక్ పూర్తిచేసింది. విద్యతోపాటు రాజకీయాలు అర్ధంచేసుకుంది. మహిళా ఉద్యమాలలో పాల్గొన్నది.
చదువులతల్లి :
నాటి తెలంగాణ గోస :
అప్పుడు తెలంగాణలో నిజాం రాచరిక పాలన ఉండేది. బ్రిటీష్ సామ్రాజ్యవాదుల ఆలోచనల ప్రకారం నిజాంపాలన సాగేది. సంస్థానాధీశులు, దేశముఖు లక్షల ఎకరాల భూమిని తమ ఆధీనంలో ఉంచుకునేవారు. భూస్వాములు, గ్రామీణ పెత్తందార్ల క్రింద గ్రామ ప్రజలు, రైతులు కష్టాలు పడ్డారు. అన్ని కులాలవారు అణిగి ఉండాల్సిందే. వెట్టిచాకిరి పేరుతో ప్రతిఫలం లేకుండా భూస్వాముల ఇండ్లలో పనిచేయాలి. తిరగబడితే దండన. ఇంటిలో పెంచుకున్న కోడినో, కుక్కనో చంపినట్లుగా పేదలను చంపినా అడిగేవారు లేరు. చట్టం లేదు; తెలుగుభాషలో చదువుకునే అవకాశాలు లేవు. పాఠశాలలు, గ్రంథాలయాల స్థాపనకు అడ్డంకులుండేవి. ఇట్లాంటి గోసను కమలాదేవి సహించలేక పోయింది. ఇట్లాంటి కష్టాలు ఆమెలో ఉద్యమభావాలకు ప్రాణం పోశాయి. 1944 లో పుట్టిన కొడుకుకు 'విప్లవం' అని పేరుపెట్టింది. పురిటిబిడ్డను చుట్టాలదగ్గర వదిలేసి కమలాదేవి ఉద్యమ కదనరంగానికి కదిలింది.
అక్షరాస్యతకై పోరాటం :
చల్లని వెన్నెలవంటి చిరునవ్వు
అమృతంకురిసే ఆత్మీయమైన పలకరింపు వయోభేదాలు పాటించని మమతల హరివిల్లు మృదుమధురమైన మాటల పూలజల్లు కురిసే కమలాదేవి జాతీయ భావాలతో ఎదుగుతూ, ఇతరులకు ఏదైనా సాయంచేయాలని నిరంతరం తపనపడేది. తనలాగే తన ఊరి జనులు చదువుకోవాలని ఆకాంక్షించింది. కొలనుపాకలో పాఠశాల స్థాపించాలని అనుకున్నది. అప్పుడు ఊరిలో బడిలేదు. అది జాగీర్ గ్రామం. బడిపెట్టాలన్నా, గ్రంథాలయం నడపాలన్నా ఆంక్షలు ఉండేవి. వంటశాల పేరుతో తలుపులూ, కిటికీలూ లేని స్థలంలో విద్యార్థులను పోగుచేసి కమలాదేవి బడిని, గ్రంథాలయాన్ని నడిపింది. కొంతకాలానికి ఈ విషయం జాగీర్దారులకు తెలిసిపోయింది. వారు ఈ కేంద్రాన్ని మూసివేయించారు. కొలనుపాకలో పురాతన జైన దేవాలయమున్నది. ఆ నిర్వాహికులనడిగి అక్కడ ఒక ఏడాదిపాటు బడి నడిపి గ్రామీణ వయోజనులను అక్షరాస్యులుగా దానితోపాటు మార్చింది. రైతుకూలీలను సమరోన్ముఖులను గావించింది. రానున్న మహాసంగ్రామానికి
ఉద్యమంలో కాళిక :
నిజాం నిరంకుశత్వంపై పిడికిలెత్తిన సబల! నిజాం న
శత్రువుపై విరుచుకుపడిన వీరనారి!!
రెండవ ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులవి. ఒకవైపు ప్రపంచయుద్ధాలు, రెండవవైపు తెలంగాణలో ప్రజోద్యమజ్వాలలు, ఆంధ్రమహాసభ ఒక ఉద్యమంగా రూపొందుతున్న సందర్భం. ఇటువంటి సమయంలో స్త్రీలకు ఆత్మరక్షణ అవసరమని భావించింది కమలాదేవి. కమ్యూనిస్టుపార్టీవారు నిర్వహించిన "మహిళా ఆత్మరక్షణ శిక్షణ శిబిరం"లో సైనిక శిక్షణ పొందింది. తుపాకి పట్టింది. భర్తతోపాటు తెలంగాణ సాయుధ సమరంలో అడుగుపెట్టింది. రజాకార్లతో, నిజాం పోలీసులతో జరిగిన ప్రతిఘటన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నది. చల్లూరు గుట్టల్లో జరిగిన చారిత్రాత్మక పోరాటంలో అపరకాళికవలె విజృంభించింది. పరాక్రమాన్ని ప్రదర్శించింది. అమెరికన్ రైఫిల్తో శత్రువులను తిప్పికొడుతూ దళానికి నష్టం వాటిల్లకుండా కాపాడింది.
ఈ పోరాటంలో జబ్బుపడింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా నిజాం పోలీసులు కమలాదేవిని అరెస్టుచేశారు. వరంగల్, ఔరంగాబాద్, సికింద్రాబాద్ మొదలైన జైళ్ళలో శిక్షలను భరించింది. వేలాదిమంది బలిదానంతో, వీరుల త్యాగాలతో నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి చెందింది. తెలంగాణ విమోచన స్వర్ణోత్సవాల సందర్భంగా అనేక సంస్థలు ఆరుట్ల కమలాదేవిని సత్కరించాయి. ఆరుట్ల కమలాదేవి నిజంగా...
అరణ్య, అజ్ఞాతవాసాలు భరించిన సాహసి జైల్లోనూ హక్కులకోసం పోరాడిన ధీశాలి భూస్వాముల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన విప్లవయోధ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎగిసిన అగ్నిజ్వాల!!
రాజకీయ చైతన్యం :
1952 ລ້ సాధారణ ఎన్నికలలో ఆలేరునుండి అత్యధిక ఓట్ల మెజారిటీతో శాసనసభకు ఎన్ని 3໖. 1967 ລ້ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ప్రజల ఆదరాభిమానా లను పొందింది. 1964 5 నభలో ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు నిర్వహించింది. స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలుగా చరిత్ర సృష్టించింది. ప్రజల దైనందిన సమస్యలపై అసెంబ్లీ లోపల, బయట క్రియాశీలంగా పోరాడింది. పలు సమస్యలపై శాసనసభలో చర్చలు జరిగి నప్పుడు వారి ప్రసంగంలో హుందాతనం, ఉన్నతభావాలు, ప్రజల సమస్యలపై అవగాహన, వగాహన, స్పష్టంగా కనిపించేది. 1998లో కాకతీయ విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
విశిష్ట వ్యక్తిత్వం :
కమలాదేవిది సహృదయం. సత్యాన్వేషి ఆమె. కష్టజీవుల కడగండ్లు చూస్తూ కన్నీరుపెట్టే కరుణామయి. కష్టాలనుండి శాశ్వత విముక్తిని సాధించేవరకు నిద్రపోని వ్యక్తిత్వం ఆమెది. ఆమె ధన్యజీవి. తెలుగు మహిళలకు వెలుగుబాట చూపిన పుణ్యమూర్తి. గొప్ప మానవతావాది.
కమలాదేవి కార్యశీలతలో నాయకత్వ లక్షణాలు అడుగడుగునా కనిపించేవి. ఆమె చూపులోను, నడుముకు కట్టిన కొంగులోను, కత్తిలాగ పట్టుకునే కలంలోనూ అవి కనిపించేవి. ఆమెను కొత్తగా చూసినవారికి ఒక గృహిణిగా, ఒక మాతృమూర్తిగా, ఒక సాధారణ మధ్యతరగతి మహిళగా కనిపించేది. ఆమె ఎవ్వరితోనూ మహానాయకురాలిగా ప్రవర్తించలేదు.
ఉన్నతాశయాలతో ఉత్తమ వ్యక్తిత్వంతో పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆరుట్ల కమలాదేవి జనవరి 1వ తేది 2001న ఈలోకం విడిచింది. కాని తెలంగాణ పల్లె తల్లుల చిరునవ్వుల్లో బతికే ఉన్నది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి