12 భూమిక గూడూరి సీతారాం 10th lesson

12 భూమిక
గూడూరి సీతారాం

చదువండి - ఆలోచించి చెప్పండి.

పుస్తకాలకు రెక్కలుండవు. కాని వాటిని చదివితే మనకు రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచనాశక్తిని, సృజనాత్మకతా నైపుణ్యాన్ని, లోకపరిశీలనా దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని అందిస్తాయి. మంచిపుస్తకం ఉత్తమమిత్రునితో సమానం. శరీరానికి వ్యాయామం ఎట్లాంటి శక్తినిస్తుందో మంచిపుస్తకం చదవడంవల్ల మనసుకు అలాంటి ఉత్తేజం కలుగుతుంది, ఏది మంచిపుస్తకం, ఏ పుస్తకాన్ని చదువాలనే ఎంపికలో పుస్తక పరిచయవాక్యాలు మార్గదర్శనం. చేస్తాయి.

ప్రశ్నలు

1. పుస్తకాలు చదువడంవల్ల కలిగే ప్రయోజనాలు ఏవి?

2. ఎటువంటి పుస్తకాలను చదువాలి?

3. ఏదైనా పుస్తకాన్ని చదువాలి' అనే ఆసక్తిని కలిగించే అంశమేది?

4. మీరు చదివిన కొన్ని పుస్తకాల పేర్లు చెప్పండి.

పాఠం ఉద్దేశం
 ముందుమాటవల్ల పుస్తకంపై ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి, ఆతురత ఎట్లా ఏర్పడుతాయో తెలియజేస్తూ దాని స్వరూపస్వభావాలను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం 'పీఠిక' ప్రక్రియకు చెందినది. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయప్రయాసలను తెలియజేసేదే వీరిక. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయితగాని, మరొకరుగాని, విమర్శకుడుగాని రాసే విశ్లేషణాత్మక పరిచయవాక్యాలను పీఠిక అంటారు. దీనికే ముందుమాట, భూమిక, ప్రస్తావన, తొలిపలుకు, మున్నుడి. ఆముఖం మొదలైన పేర్లెన్నో ఉన్నాయి. నేషనల్ బుక్స్ట్ ప్రచురించిన 'నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు' సంపుటికి గూడూరి సీతారాం రాసిన పీఠిక ప్రస్తుత పాఠ్యాంశం.

రచయిత పరిచయం

రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గరగల హనుమాజీపేట గ్రామంలో గూడూరి సీతారాం జన్మించాడు. 1953 నుండి 1965 వరకు సుమారు 80 కథలవరకు రాశాడు. వీటిలో కొన్ని కథలు మాత్రమే దొరుకుతున్నాయి. తెలంగాణ కథా సాహిత్యంలో పేదకులాల జీవితాలను, అట్టడుగు వర్గాల భాషను అక్షరబద్ధం చేసిన రచయిత, స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథలకు దిక్సూచిగా నిలబడటమే గాకుండా 1953లో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు. పలు గ్రంథాలకు సంపాదకుడిగా వ్యవహరించాడు. 'మారాజు, ల పిచ్చోడు, రాజమ్మ రాజీరికం' ఈయన ప్రసిద్ధ కథలు. తెలంగాణ భాషను, యాసను ఒలికించడం ఈయన కలానికున్న ప్రత్యేకత.
18-07-1936. 25-09-2011.

ప్రవేశిక

కథలు ఒకప్పుడు మానసికానందాన్ని, నైతిక విలువలను చెప్పడానికి పరిమితమై ఉండేవి. 20వ
శతాబ్దంలో ఆధునిక కథానిక సాహితీరంగ ప్రవేశం చేయడంతో కథ స్వరూప స్వభావాల్లో స్పష్టమైన " మార్పులు చోటుచేసుకున్నాయి. కథానిక సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నది. మానవ మనస్తత్వాన్ని,  సంఘర్షణను, భిన్న సంస్కృతులను తన జీవలక్షణాలుగా చేసుకున్నది. తెలుగు కథానిక అంతర్జాతీయ వేదికల మీద గర్వంగా తలెత్తుకొని నిలబడింది. అటువంటి గొప్ప కథానికా రచయితల్లో నెల్లూరి కేశవస్వామి ఒకరు
విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామి భారతీయ | కథాసాహిత్యంలో సుప్రసిద్ధులైన ప్రేమచంద్, కిషన్ చందర్లతో పోల్చదగినవాడు. ఆయన ఉత్తమ కథలు గురించి కొంతైనా తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

1వ భాగం
నెల్లూరి కేశవస్వామితో నా స్నేహం 1950ల నాటిది. నేను హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్న కాలంలో పల్లా దుర్గయ్య, మహాకవి దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, వట్టికోట ఆళ్వారుస్వామి, బిరుదురాజు రామరాజు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, డా॥ సి. నారాయణ రెడ్డి, డి. రామలింగం, నెల్లూరి కేశవస్వామి, నా చిన్ననాటి స్నేహితుడు జి. సురమౌళి, మరికొందరం తరచూ నారాయణగూడలో కలుసుకునే వాళ్ళం. సాహిత్య చర్చలు సాగుతుండేవి. నేను ఆ కాలంలోనే విరివిగా కథలురాయడం ప్రారంభించాను. తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ వారపత్రిక, తెలుగుదేశం, సుజాత, పల్లెటూరు, ప్రజామాత వారపత్రిక, స్రవంతి మాసపత్రికలలో కథలు అచ్చవుతుండేవి. నెల్లూరి కేశవస్వామి, డి. రామలింగం, జి. సురమౌళి, దాశరథి రంగాచార్య, నేను కథలు రాస్తుంటే మిగతావాళ్ళు కవిత్వం రాస్తుండే వాళ్ళు. మేము అప్పటి మా కథల అచ్చుప్రతులను కాపాడుకోలేక పోయాము. అప్పుడు ఆ ధ్యాస కూడా ఉండేది కాదు.
నా కథల్లాగే నెల్లూరి కేశవస్వామి కథలు ఎన్నో దొరకకుండా పోయాయి. అదృష్టమేమంటే ఆయన 1969లో, 1981లో కొన్ని కథలనైనా సంపుటాలుగా వెలువరించడం వల్ల తెలుగు సాహిత్యానికి దక్కాయి.

1902 నుండి ప్రారంభమై తెలంగాణ కథ సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తున్నది. బండారు అచ్చమాంబ తొలి కథకురాలని చరిత్ర స్పష్టం చేసింది. అప్పటి తెలంగాణ కథ పుట్టుక నుండి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది. సమాజపరిశీలన, విశ్లేషణ, మానసికచిత్రణ, సామాజిక పరిణామాలు, ఫ్యూడలీజం, ప్రజాస్వామిక స్వేచ్ఛావాయువులు, తెలంగాణ పలుకుబడులు, గ్రామీణ కులవృత్తులు, సంస్కృతి, గ్రామీణజీవితం, ఉర్దూమీడియం పోయి తెలుగు మీడియం రావడం, ప్రజాస్వామిక ఉద్యమాలు, రాజకీయ పరిణామాలు మొదలైనవి తెలంగాణ కథలో పలు కోణాల్లో చిత్రించబడ్డాయి. 1918లో స్థాపించబడి, దేశంలోనే మిక్కిలి ప్రసిద్ధి గాంచిన ఉస్మానియా యూనివర్సిటీ ఇందుకు భూమికనందించింది.

హైదరాబాద్ రాజ్యం స్వాతంత్య్రానికి పూర్వం ఒక ప్రత్యేకదేశంగా, రాజ్యంగా సొంతకరెన్సీని, సైన్యాన్ని కలిగివుండిన, ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశం. హైదరాబాద్ రాజ్యం బ్రిటీషిండియాలోని అతి పెద్దరాజ్యం. అంత పెద్ద రాజ్యం ఇండియాలో మరొకటి లేదు. తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, ప్రాంతాలతో హైదరాబాద్ రాజ్యం కొనసాగింది.

హైదరాబాద్ రాజ్యంలో నిజామాంధ్ర మహాసభ, కమ్యూనిస్టులు, స్టేట్ కాంగ్రెస్, ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వాతంత్య్ర్యంకోసం ఉద్యమించారు. 1946-1951 మధ్య తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది. ఈ సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగువేల మంది చనిపోయారు. మరోవైపు రజాకార్లు విజృంభించి రైతాంగ పోరాటంపై దాడులు చేశారు. రజాకార్లకు కాశీంరజ్వీ నాయకత్వం వహించాడు. 1944-51 మధ్య హైదరాబాద్ రాజ్యంలోని అంతర్యుద్ధం, సామాజిక సంక్షోభంవల్ల ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాద్ రాజ్యంపై దండెత్తి రజాకార్లను, ఉద్యమకారులను, కమ్యూనిస్టులను అణిచివేశారు. 13 సెప్టెంబర్, 1948న హైదరాబాద్ రాజ్యంలోకి ఇండియన్ యూనియన్ సైన్యాలు ప్రవేశించాయి.

17 సెప్టెంబర్, 1948న నిజాం రాజు లొంగిపోయినట్టు ప్రకటించడం, హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ లో విలీనమైనట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించడం, ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. హైదరాబాద్ రాజ్యం నుండి కొందరు ముస్లింలు పాకిస్తాన్కు వెళ్ళిపోవాలని భావించారు.
 కొందరు వెళ్ళిపోయారు. ఈ చారిత్రక, సామాజిక పరిణామాలను సంక్షుభిత సమాజాన్ని, మానసిక సంఘర్షణను కథల రూపంలో నిక్షిప్తం చేసిన కథకుడు నెల్లూరి కేశవస్వామి.

హైదరాబాద్ లో పుట్టిన నెల్లూరి కేశవస్వామి నిజాం కాలేజీలో 'ప్రి డిగ్రీ' చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీర్ పట్టభద్రుడై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పబ్లిక్వర్క్స్ డిపార్టుమెంటు నీటిపారుదల శాఖలో ఇంజనీర్ గా పనిచేసి రిటైరయ్యారు. కేశవస్వామి హైదరాబాద్ నగరంలో నివసిస్తూ, అక్కడి జీవితాలను, సంస్కృతిని తెలుగులో చిత్రించిన రచయిత,

ఆలోచించండి-చెప్పండి.

కథలకు, కవిత్వానికి గల భేదం ఏమిటి? మీకు ఏవంటే ఇష్టం? ఎందుకు?

నాటి హైదరాబాదు రాజ్యంలో హక్కులకోసం, స్వాతంత్ర్యంకోసం ప్రజలు ఎందుకు ఉద్యమించి ఉండవచ్చు?

హైదరాబాదు నగర జీవితాన్ని, సంస్కృతిని తెలుగులో చిత్రించడం అంటే మీకేమి అర్థమైంది?

2వ భాగం

ఇండియన్ యూనియన్లోని జాతీయోద్యమ కాలంలో హైదరాబాద్ రాజ్యంలో ఏం జరుగుతూ వచ్చిందో నెల్లూరి కేశవస్వామి కథల ద్వారా మనకు కొంతైనా తెలుస్తుంది. హైదరాబాద్ రాజ్యం గురించి తమిళంలో, మరాఠీలో వచ్చినంత సాహిత్యం తెలుగులో రాలేదు. తమిళం, మరాఠీలో వచ్చిన హైదరాబాద్ రాజ్యం గురించిన కథలు, నవలలు కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా పలుభాషల్లోకి అనువదించబడ్డాయి. అలా   తెలుగులోకి వచ్చాయి. కేశవస్వామి కథలు తెలుగులో రాయబడిన  కథలు. తెలుగు సాహిత్యంలో ఈ కథలకు విశిష్టస్థానం వుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అనే ప్రాంతీయ విభాగాలున్నాయి. నెల్లూరి కేశవస్వామి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు రచయిత. హైదరాబాద్లో నివసించి హైదరాబాద్లోని జీవభాషను కథల్లో చిత్రించిన రచయిత. ఆయన చాలా కథలు రాశారు. ప్రస్తుతం వాటిలో కొన్ని మాత్రమే లభిస్తున్నాయి. వీరి తొలి కథల సంపుటి 'పసిడిబొమ్మ' ఆగస్టు 1969లో వెలువడింది. మరో తెలంగాణ సుప్రసిద్ధరచయిత కీ. శే. భాస్కరభట్ల కృష్ణారావుగారికి ఈ కథల సంపుటి అంకితం ఇవ్వబడింది. ఈ సంపుటిలోని కథలు రచయిత ప్రారంభదశను తెలపడంతో పాటు క్రమంగా చక్కని రచయితగా ఎదిగిన క్రమాన్ని కూడా స్పష్టం చేస్తాయి.

కేశవస్వామి రెండవ కథాసంకలనం "చార్మినార్ కథలు". ఇవి కేవలం ఊహాజనిత కథలు కావు. సామాజిక పరిణామాలకు సాహిత్య రూపం ఇచ్చిన సామాజిక చరిత్ర రచన అని చెప్పవచ్చు. చార్మినార్ కథలు హైదరాబాద్ రాజ్యం చరిత్రను, సంస్కృతిని, మానవ సంబంధాలను, ఇక్కడి ముస్లింల జీవితాలను అపూర్వంగా చిత్రించాయి. ఇందులో 'విముక్తి', 'రూహిఆపా', 'షరీఫా', 'ప్రతీకారం', 'అదృష్టం', 'యుగాంతం', 'వంశాంకురం', 'కేవలం మనుషులం' 'ఆఖరి కానుక', 'భరోసా' అనే శీర్షికలతో రాసిన 11 కథలున్నాయి.

చార్మినార్ కథల్లోని సవాబులు, దేవిడీలు, మహబూబ్ కి మెహిందీ, కోఠీలు, దివాన్ ఖాన్లలు, జనానా ఖానాలు, బేగం సాహెబాలు, దుల్హన్ పాషాలు, పాన్దాన్, పరాటా కీమా, దాల్చా, సమాజులు, పరదాల వెనుక జీవితంలోని సంస్కృతి, సంఘటనలు లక్నో, అవధ్, ఢిల్లీలలోని ముస్లిం రాజుల, రాజ్యాల ప్రజల జీవితాలను, అవిభక్త ఇండియాలోని పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాల సంస్కృతిని, మధ్య ఆసియా ముస్లిం దేశాల సంస్కృతిని గుర్తుకు తెస్తాయి. ఈ కథలు అంతర్జాతీయ సంస్కృతి, జీవన విధానం హైదరాబాద్ రాజ్యంలో నిర్దిష్టంగా ఎలా వుండేదో తెలుపుతాయి. 11వ శతాబ్దం

నుండి ఇండియాలో సాగిన ముస్లింల వలసలు, రాజ్యాలు, అవి తెచ్చిన పరిపాలనా విధానాలు, జీవన విధానం, సంస్కృతి భారతీయ సంస్కృతిపై, జీవన విధానంపై చెరగని ముద్ర వేసాయి. భారతీయ సంస్కృతిలో, జీవితంలో అంతర్భాగమైనాయి. అవి హిందూ ప్రజల జీవితంలోకి కూడా ప్రవేశిస్తూ, రెండు మతాల మధ్య ఆలోచనల్లో, సంస్కృతిలో, జీవితంలో ఆదా ప్రదానాలు జరిగాయి. అలా ఒక నూతన సమన్వయ సంస్కృతి విస్తరించింది. అలా విస్తరించడంలో భాగంగా హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. ఆ నేపథ్యాన్ని, ఆ జీవితాలను కేశవస్వామి తన కథల్లో చిత్రించారు.

'యుగాంతం' కథ ప్రత్యేకంగా చెప్పాల్సిన కథ. ఇండియా రెండు దేశాలుగా విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు, సంక్షోభాలు, హత్యాకాండ గురించి భీష్మ సహాని 'తమస్' నవలలో చిత్రించారు. అది దూరదర్శన్ టీవీ సీరియల్గా ప్రసారమైనప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగింది. అలాంటి పరిస్థితులే హైదరాబాద్ రాజ్యంలో 1946-50ల మధ్య ఎలా కొనసాగాయో చాలా మందికి తెలియదు. హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డంతో మూలకు నెట్టివేయబడింది. ఒక సామాజిక వ్యవస్థ, రాజరిక వ్యవస్థ అంతమవుతూ ఒక నూతనదశలోకి సమాజం, మానవ సంబంధాలు మారుతున్న పరిణామాలను చిత్రించడం వల్ల కథకు 'యుగాంతం' అనే పేరు సార్థకతను చేకూర్చింది.

‘యుగాంతం’ నిజంగానే ఒక యుగాంతాన్ని చిత్రించిన గొప్ప కథ. హైదరాబాద్ రాజ్యంలోని ప్రత్యేక పరిణామాలను, సామాజిక చరిత్రను ఈ కథ ఒక చారిత్రక డాక్యుమెంటులా మనముందుంచుతుంది. ఈ ఒక్క కథ రాసి మరేమీ రాయకపోయినప్పటికీ నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడుగా కీర్తించబడేవాడు.

చార్మినార్ కథల సంపుటి వెలువడిన నేపథ్యం నెల్లూరు కేశవస్వామిని రచయితగా హిమాలయాల ఉన్నత శిఖరాలపై
నిలుపుతుంది. కొన్ని అసాంఘిక శక్తులు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హిందూ, ముస్లిం సంఘర్షణల పేరిట అపార్థాలు
సృష్టించి మారణకాండను జరిపారు. హిందూ, ముస్లింల మధ్య అసలు నేరస్తులు, వారి రాజకీయ లక్ష్యాలు తెలియక
అనుమాన బీజాలు పెరిగాయి.

ఆ సంక్షుభిత వాతావరణంలో హిందూ, ముస్లింల సఖ్యత కోసం ఎందరో ప్రజాస్వామికవాదులు నడుం బిగించారు. రచయితగా, లోహియా సోషలిస్టుగా నెల్లూరు కేశవస్వామి ఈ సంఘటనల పట్ల చలించిపోయి అశాంతిగా గడిపిన నిద్రలేని రాత్రులెన్నో... తాను ఈ సమాజంలో తిరిగి హిందూ, ముస్లిం సఖ్యత కోసం ఏమి చేయలేనా? రాజకీయాల కోసం మానవ సంబంధాలు, మమతలు, మతాలు, కులాతీత, మతాతీత స్నేహాలు, ఆత్మీయతలు బలికావల్సిందేనా అని... అలా కావడానికి వీల్లేదని, తాను జీవించిన, తాను అనుభవించిన స్నేహం, ఆత్మీయత, కులాతీత, మతాతీత మమతలు, ఓల్డ్ సిటీ జీవితాన్ని చార్మినార్ కథలుగా వెలువరించారాయన. ఇలా ఒక సామాజిక శాస్త్రవేత్తగా చైతన్యశీలిగా తన వంతు కర్తవ్యాన్ని కేశవస్వామి నెరవేరుస్తూ రాసిన కథలివి. చార్మినార్ కథలు కేవలం కథలు కావు. వాస్తవ జీవితాల, సామాజిక పరిణామాల సామాజిక చరిత్రను నిక్షిప్తం చేసుకున్న చారిత్రాత్మక కథలు. ముఖ్యంగా నిజాం రాజ్య యుగాంత పరిణామాలను చిత్రించిన కథలు. ఈ కథల్లో నెల్లూరి కేశవస్వామి హృదయం వుంది.

ఆలోచించండి-చెప్పండి.

అపార్థాలు ఎందుకు వస్తాయి?

 'చార్మినార్' కథలను ఎందుకు చదువాలి?

రెండు మతాల మధ్య ఆలోచనలు, సంస్కృతిలో ఆదానప్రదానాలు జరగడం అంటే ఏమిటి?

2వ భాగం

అందులో భాగంగా చూసినప్పుడు కేశవస్వామి రాసిన 'రుహీ ఆపా' కథ మహోన్నతమైన మానవీయ సంబంధాలను, మనిషిలోని సున్నితమైన హృదయాన్ని కులమతాలకు అతీతంగా స్పందించే మనిషిని చిత్రించిన కథ. ముజ్రాల జీవితాల్లో ఆనందించే, జీవితమంతా హృదయంలో దాచుకునే సంతోష సన్నివేశాలు 'రూహీ ఆపా'లో చిత్రించారు కేశవస్వామి. రెండు కథల పాత్రలకు అవే పేర్లు ఉంచడంలో రచయిత ఒక స్పష్టమైన దృష్టితోనే రాశాడని చెప్పకనే తెలుస్తున్నది. 

ఒక రోజు రమణి పాట వినడానికి నవాబుగారు వస్తున్నారని అమ్మ తయారుకమ్మని చెప్పుతుంది. ఏదో అనుమానం పొడసూపితే అలాంటిదేమీ లేదని తల్లి హామీ ఇస్తుంది. నవాబు ముందు ఒక గజల్ అందుకుంది. అది విన్నంతసేపు నవాబుగారు కళ్ళు మూసుకునే వున్నారు. నవాబుగారు నెలకు వెయ్యి రూపాయలు భరణం ఇస్తారని వారానికోసారో, నెలకోసారో వారి దేవిడీకి (భవంతికి) మధ్యాహ్నం పూట వెళ్ళి గంటో రెండు గంటలో పాటలు వినిపించి రావాలని ముజ్రాలు పూర్తిగా మానివేయాలని, కావాలంటే రేడియోలో ప్రోగ్రాం ఇవ్వొచ్చని చెప్పినట్టు తల్లి చెపుతుంది. ఆనాటి నుంచి రమణి రోజు వారి కార్యక్రమం మారిపోయింది. ఒకరోజు నవాబు నీకీ పేరు బాగాలేదని 'రూహి' అని పేరుతో పిలుస్తానని కోరుతాడు.

రెండేళ్ళ తర్వాత అతని కొడుకు రూహికి ఎదురవుతాడు. నవాబు వూరుకు వెళ్ళిన సమయంలో చిన్న నవాబు సలీం రూహిని ఆహ్వానిస్తాడు, రూహి పరిపరి విధాలుగా పోతుంది. సలీం ఆమెని తమ రహస్య గదిలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక పరదా వేసిన ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో అచ్చం రూపా (రమణి) లాగే వుంటుంది. రూహి ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోతుంది. మా అక్క అని సలీం చెపుతాడు. నిన్ను అక్క అని పిలవాలని వుందని రూహిఅపా అని పిలుస్తాడు. రూహిఅపాసు నవాబు ఎందుకంత ఇష్టపడి వాత్సల్యం చూపాడో మనకు తెలుస్తుంది. ఆమె నవాబు కూతురా? అని పాఠకులకు సందేహం కలుగుతుంది. సొంత కూతురులా నవాబు, నవాబు కొడుకు ఒక ముజ్రాల రమణిని గౌరవించిన తీరును చిత్రించడం ద్వారా ముస్లిం నవాబుల్లో కొనసాగిన హృదయ సంస్కారాన్ని రచయిత ఒడిసి పట్టాడు.

ఇందులోని 'షరీఫా', 'ప్రతీకారం', 'అదృష్టం', 'వంశాంకురం', 'కేవలం మనుషులం', 'భరోసా', 'ఆఖరి కానుక’ మొదలగు కథలు విశిష్టమైనవి. దేనికవే ప్రత్యేకమైనవి. 'వంశాంకురం' కథలో ముస్లిం పెళ్లి సంబంధాలెలా వుంటాయో, కొడుకు పుట్టాలనే ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతలాకుతలం చేసి ఆత్మహత్యకు పురికొల్పుతాయో హృదయవిదారకంగా చిత్రించింది.

'కేవలం మనుషులం' కథలో హుస్సేన్ మిర్జా, మహబూబ్రాయ్ సక్సీనా దశాబ్దాల స్నేహితులు. వారి కుటుంబాలు

స్నేహంగా కలిసి వుంటాయి. మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించిన చక్కని కథ. ‘భరోసా' కథ సమ్మిన పేదలను నట్టేట ఎలా ముంచుతారో భరోసాను భగ్నం చేసిన యథార్థ కథ. 'ఆఖరి కాసుక' కథ రోజురోజుకు పేదరికంలోకి ఈడ్వబడుతున్న ముస్లిం కుటుంబాలు అరబ్బు దేశాల షేక్లకు తమ కూతుళ్ళను ఇచ్చి పెళ్ళి

చేసి తద్వారా కాస్త ఆర్థిక సౌలభ్యం పొందాలనుకునే దుస్థితిని తెలియజేస్తుంది.

ఇలా వాసిలో, విశిష్టమైన వస్తు, శిల్ప నైపుణ్యంతో మహోన్నతమైన కథలు రాసిన నెల్లూరి కేశవస్వామిని భారతీయ సాహిత్యంలో పోల్చవలసి వస్తే ఉర్దూ, హిందీల్లో రాసిన సుప్రసిద్ధ రచయితలు ప్రేంచంద్, కిషన్ చందర్ల కోవకుచెందిన







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana